Slider ప్రత్యేకం

దళితుల్ని చంపుతున్నారు… మహిళల్ని వాడుకుంటున్నారు

#kondrumurali

మొన్న సుధాకర్.. నిన్న సుబ్రహ్మణ్యం.. తాజాగా ఎంపీ గోరంట్ల..

 జగన్ ప్రభుత్వం.. అటు రాష్ట్ర ప్రజలను.ఇటు చట్ట సభలను..వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ద్వారా అప్రతిష్ట తెచ్చి పెడుతున్నారన్న అంశం..ఆ పార్టీ ఎంపీ గోరంట్ల వ్యవహారంతో మరింతగా బలపడిందని మాజీ మంత్రి టీడీపీ నేత రాజాం ఇంచార్జ్ నేత కొండ్రు మురళి అన్నారు.

సుధాకర్ నుంచీ సుబ్రహ్మణ్యం వరకూ… తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహార శైలేంటో తేటతెల్లమైందన్నారు… కోండ్రు మురళీ.ఈ మేరకు టీడీపీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లా లో మీడియా తో మాట్లాడారు.సీఎం జగన్ నేతృత్వంలో… వైఎస్సార్సీపీ కి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యే లు ఆఖరికి స్థానిక ప్రజాప్రతినిధులు వరకూ ప్రతీ ఒక్కరూ… మరీ ముఖ్యంగా రాష్ఠ్రాన్ని భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కోండ్రు ధ్వజమెత్తారు.

రాష్ట్ర పరువును దేశంలో తాకట్టు పెట్టారని…అదీ ఓ పార్లమెంట్ మెంబర్ గా… గోరంట్ల మాధవ్ నిస్సుగా మాట్లాడటం..ఏమీ బాగోలేదన్నారు..కులాన్ని మతాలను విడగొట్టాలని…సీఎం జగన్ కంకణం కట్టు కున్నారని ఆరోపించారు.

అటు సీఎం జగన్ నకు ఇటు ట్విట్టర్ నాయుకుడు విజయసాయిరెడ్డి కి ఇవేవీ కనిపించటం లేదా అని టీడీపీ ప్రశ్నిస్తోందన్నారు.. మహిళలకు గౌరవం లేదు దళితుల పట్ల మనిషి ని చంపి. పార్శిల్ చేస్తున్నారని…సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎంఎల్సీ ఏ విధంగా చంపాడో…అందులో సీఎం జగన్ ఏ విధంగా చేసాడో ప్రజలకు తెలుసునన్నారు..

బూతులు మాట్లాడించడం….అదీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ కు తెలుసునని..గోరంట్ల వ్యవహారం తో నైనా… సీఎం జగన్ మారాలని… అలాగే ఆ పార్టీ ప్రజాప్రతినిధుల వైఖరిలో కూడా మార్పు రావాలని టీడీపీ నేత కోండ్రు మురళీ స్పష్టం చేసారు. ఈ మీడియా సమావేశంలో విజయనగరం పార్టీ నేతలు బొద్దల నరసింహ రావు..తదితరులు ఉన్నారు.

Related posts

బైంసా అల్లర్ల పై పార్లమెంటులో గళం విప్పిన ఎంపీ సోయం

Satyam NEWS

అనారోగ్యంతో చికిత్స పొందుతూ న‌ర్సింగ్ యాద‌వ్ మృతి

Sub Editor

అన్న‌దాత‌ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment