ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని కంచి సదానంద స్వామీ, అంజనా నంద తీర్థ స్వామీ నేడు దర్శించుకున్నారు.
కంచి మఠం నుండి వచ్చిన వారు దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో వి.హరి సూర్య ప్రకాష్ శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని స్వాములకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, సహాయ కమిషనర్ కార్యాలయ సూపరిండెంట్ డి.వి.వి. ప్రసాద్ రావు, ఆలయ పాలకమండలి సభ్యులు యామిజాల గాయత్రి, మండల మన్మధ రావు తదితరులు పాల్గొన్నారు.