ఈనాడు మనం స్వేచ్ఛ సంతో జీవిస్తున్నాం అంటే దానికి కారణం ఆ నాటి స్వాతంత్ర సమరయోధుల ఫలితమేనని ములుగు డిఆర్వో రమాదేవి అన్నారు.
సోమవారం జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రమాదేవి హైదరాబాదు లోని దిల్ సుఖ్ నగర్ , మారుతి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న స్వాతంత్ర సమరయోధుడు కోట కృష్ణ రెడ్డి ని పండ్లు, శాలువా తో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా కోవిడ్ నిబంధన ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు కలెక్టర్ సూచన మేరకు స్వతంత్ర సమరయోధులు వారు ఉన్న చోటికి వెళ్లి సన్మానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాంటి స్వాతంత్ర సమరయోధుడు మన ములుగు జిల్లా వాసి అయినందుకు గర్వంగా ఉందని అన్నారు.