31.2 C
Hyderabad
May 3, 2024 02: 54 AM
Slider నల్గొండ

రుణమాఫీ చేసినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

#Telangana CM KCR

రైతులకు  25000 లోపు రుణాలను మాఫీ చేసినందుకు,1210 కోట్లు రైతుబంధు నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా 25000 మాఫీ చేశారని అన్నారు. కరోనా  లాక్ డౌన్ సందర్భంగా ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు, 12కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చి పేదల పెన్నిధి అని మరోమారు నిరూపించుకున్నారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప నర్సింహ, ఉపసర్పంచ్ రాచకొండ శ్రీనివాస్, టిఆర్ఎస్  నాయకులు రాచకొండ కిష్టయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు మారగోని శివశంకర్ ,ప్రధాన కార్యదర్శి జవ్వాజి శేఖర్,వార్డు మెంబెర్లు బొడిగే బాలరాజు, లింగస్వామి,గోపగోని నర్సింహ,కోయగుర సన్నీ ,కోయగుర నర్సింహ పాల్గొన్నారు.

ఇంకా చెరుకు మధుసూదన్,పానుగుళ్ల పవిత్ర, ఆకుల శ్రీనివాస్, కుంభం బాషయ్య,నమ్ముల కిష్టయ్య,గోపగోని లింగస్వామి,అన్నెబొయిన వెంకటేశం,మాలిగే లింగస్వామి,పానుగుళ్ల వెంకటేశం,గోపగోని నర్సింహ, చిన్న వెంకట్రెడ్డి,బొడిగే సాయి కుమార్ ,రావుల మధుసూదన్ ,బుస్సు శ్రీనువాస్,అంతటి సత్తయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

శ్రద్ధాను శారీరకంగా హింసించిన ఆఫ్తాబ్

Satyam NEWS

గ్రామ సచివాలయంకు వాటర్ కూలర్ వితరణ

Satyam NEWS

మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలను పంపిణి చేసిన ఎన్.వై.కే…!

Satyam NEWS

Leave a Comment