40.2 C
Hyderabad
May 6, 2024 18: 41 PM
Slider వరంగల్

ములుగు జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడికి అభినందనల వెల్లువ

#muluguTRSparty

ములుగు జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు గా నియమితులైన కుసుమ జగదీశ్ కు సీనియర్ నాయకులు పిండి రవియాదవ్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకులు అయిన ములుగు జిల్లా జడ్పీఛైర్మెన్ కుసుమ జగదీష్ ను జిల్లా అధ్యక్షులుగా నియమించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీష్ నాయకత్వంలో ములుగు జిల్లా ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కుసుమ జగదీశ్ నాయకత్వంలో యువకులు సీనియర్ నాయకులు ఉత్సహంగా పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. జగదీష్ ముందు ముందు మరెన్నో ఉన్నత పదవులను స్వీకరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, నియోజకవర్గం యువజన విభాగం ఇంచార్జి కొగిలా మహేష్, సీనియర్ నాయకులు గోవింద్ నాయక్, తుమ్మ మల్లారెడ్డి, తహర్ పాషా, కృష్ణరెడ్డి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంత మంది గొంతు నొక్కుతారు?

Satyam NEWS

40 మంది వరకూ సిట్టింగులకు టిక్కెట్లు గల్లంతు?

Satyam NEWS

అత్యాచారం కేసులో మసీదు హఫీజ్ కు బెయిల్ నిరాకరణ

Satyam NEWS

Leave a Comment