27.7 C
Hyderabad
April 30, 2024 08: 24 AM
Slider నల్గొండ

ముగురమ్మల దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

#ysrtp

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలతో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా,ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి.

5,6, 9వ,తేదీలలో మూడు రోజుల పాటు హుజూర్ నగర్ పట్టణంలో జరిగే ముత్యాలమ్మ,కనకదుర్గమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జీ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పత్రిక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరగనున్న జాతరలో భక్తులు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి అమ్మవారిని సేవించి మొక్కలు చెల్లించాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే బంధు మిత్రులకు,పట్టణ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలందరూ కులమతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో తమ కుటుంబ సభ్యులతో కలసి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు.గ్రామాన్ని చల్లగా కాచి రక్షించే చల్లని గ్రామ దేవతల ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలని,సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లాలని దేవతలును ప్రార్ధించినట్లు తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఇదేమి దారుణం? ఇంత దిగజారుడుతనమా?

Satyam NEWS

గంజాయి కేసులు: పట్టుబ‌డ్డ నిందితుల‌పైనే దృష్టి పెట్టిన విశాఖ రేంజ్ ఐజీ….!

Satyam NEWS

శ్రీశైల మల్లన్న కు కాణిపాకం నుంచి పట్టువస్త్రాలు

Satyam NEWS

Leave a Comment