29.7 C
Hyderabad
May 2, 2024 03: 53 AM
Slider రంగారెడ్డి

ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపిన కొలన్‌ శంకర్‌రెడ్డి

#kolanushankarreddy

బిజేపి రాష్ట్ర అధ్యక్షులు ,పార్టమెంటు సభ్యులు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ఉదయం వికారాబాదు సాయి డెంటల్‌ కాలేజీ నుండి ప్రారంభమైనది.

ఈ ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావంగా ముఖ్యఅతిధులుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్‌, బీజేపి రాష్ట్ర నేత ,మాజీ సింగిల్‌విండో చైర్మన్‌, సంగ్రామ యాత్ర రాష్ట్ర వసతుల కమిటి సభ్యులు  కొలన్‌ శంకర్‌రెడ్డి, రాష్ట్ర ,జిల్లా నాయకులు, కార్యుకర్తలతో కలిసి బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌ పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

అవినీతి, ప్రజావ్యతిరేక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సకల జనులను  ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బిజేపి నాయకులు మురళీధర్‌, రాజా శ్రీనివాస్‌, మాదవరెడ్డి, శివరాజ్‌, సుధాకర్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం..

Sub Editor

రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

Satyam NEWS

మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరంకు కోల ఎన్నిక

Satyam NEWS

Leave a Comment