గత కొంత కాలంగా సమ్మె చేయడం వల్ల విధులకు దూరంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధులలో తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గూడెపు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షురాలు నాగలక్ష్మి,ఫీల్డ్ అసిస్టెంట్ లు చంద్రకళ,వెంకట లక్ష్మీ, ఫీల్డ్ అసిస్టెంట్ నియోజకవర్గ కమిటీ సభ్యులు పి.రవిబాబు,జె.బాలసైదులు తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్