విశాఖ,ఏలూరు రేంజ్ పరిదిలో పని చేస్తున్న లాంగ్ స్టాండింగ్ లో ఉన్న ఇన్ స్పెక్టర్లకు స్థానం చలనం కలిగింది.ఈ మేరకు అమరవాతి నుంచీ డీఐజీ రాజుకుమారీ పోస్టింగ్ ఆర్డర్స్ ను ఇటు విశాఖ రేంజ్ కు అటు ఏలూరు రేంజ్ ఐజీలకు పంపించారు.ఇందులో భాగంగా విశాఖ రేంజ్ పరిదిలో విజయనగరం జిల్లా లో జిల్లా క్రైమ్ బ్రాంచ్ విభాగపు సీఐ గా పని చేస్తున్న సీఐ డా.బండి వెంకటరావును…దువ్వాడ లా అండ్ ఆర్డర్ సీఐగా బదిలీ చేసారు.
అలాగే పోతుల మల్లయ్య పాలెం సీఐను రవిని..ఆనందపురం సీఐగాను, వీఆర్ లో ఉన్న సీఐశ్రీధర్ ను…పోతులమల్లయ్య పాఎలం సీఐగాను అలాగే వీఆర్ లో ఉన్న సీఐ నీలయ్యను కాశీబుగ్గ కు బదిలీ చేసారు.అలాగే సిక్కోలు సీసీఎస్ సీఐగా పని చేస్తున్న ఆదంను జే.ఆర్ సర్కిల్ కు బదిలీ చేసారు. ఇక ఏలూరు రేంజ్ లో వీఆర్ లో రమణను అనపర్తి సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసారు…డీఐజీ రాజకుమారీ.
ఈ మేరకు ఆయా ఉత్తర్వులను సంబంధిత రేంజ్ ఐజీలకు పంపించారు.ఇకగడచిన కొన్ని నెలలుగా వేకన్సి ఫర్ రిజర్వు లో గతంలో విజయనగరం జిల్లా భోగాపురం సీఐగా పని చేసిన శ్రీధర్ ను ఎట్టకేలకు పోస్టింగ్ వచ్చింది. సీఐ శ్రీధర్ …భోగాపురం సీఐగా శ్రీధర్ పని చేసేటప్పుడు..గంజాయి,నకిలీ నోట్లు వంటి గ్రేవ్ అఫెన్స్ లను డిటెక్ట్ చేయడంలో సర్కిల్ కు మంచి పేరు వచ్చింది కూడ. అయితే అనుకోని పరిస్థితులలో సీఐ శ్రీధర్ ను ఆకస్మాత్తుగా వీర్ కు అటాచ్ చేసారు.చాలా నెలల తర్వాత…పోతుల మల్లయ్య పాలెం కు వేస్తూ…ఉత్తర్వులు ఇచ్చారు…డీఐజీ రాజకుమారీ.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం