38.2 C
Hyderabad
April 29, 2024 21: 40 PM
Slider ఖమ్మం

పెరిగిన ధరలు తగ్గించే వరకు పోరాటం

#puvvada

రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద,మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందనీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడం పట్ల  కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్  పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రం ధర్నా చౌక్ నందు బి ఆర్ యస్ నగర పార్టీ అధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఏడాదిలో ముడు సార్లు గ్యాస్ ధరలు పెంచితే కనీసం ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలేదని, సామాన్య ప్రజల బాధలు మోడీ లాంటి వాళ్లకు ఏం తెలుస్తాయి అని, టోటల్ గ్యాస్ పేరుతో ఆదాని గ్యాస్ కు కట్టబెట్టేందుకే ధరల పెంపు అని ఆరోపించారు.చిరు వ్యాపారాలు చేసుకునే వారు వినియోగించే కమర్షియల్ సిలిండర్ పై రూ.350 పెంచితే వారి జీవనం ఎలా సాగుతుందని, నేడు లక్షల కుటుంబాలు రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేకునే వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని వారిని సైతం వదలకుండా వారి నడ్డి విరిచేశారని ద్వజమెత్తారు.తెలంగాణ సాధనకు గానీ, సాధించుకునేందుకు గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ ఎలాంటి సంబంధం లేని బండి సంజయ్ కూడా మాట్లాడుతాడు అని, కనీస అవగాహన లేకుండా నోటి నిండా తంబాకు బుక్కి సొల్లు వాగడం తప్ప నేడు మీరు రూ.50 ధర ఎందుకు పెంచావో చెప్పాలన్నారు.పాలు, పెరుగు ఆఖరికి చేనేత పై కూడా 5శాతం పన్ను విధించడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్స్ ప్రభుత్వంలో మన్మోహన్ ప్రధాని గా ఉన్న సమయంలో గ్యాస్ ధర రూ.50 పెంచితే ప్రస్తుత మంత్రి స్మృతి ఇరానీ నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసి గగ్గోలు పెట్టిందని మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. ధరలు పెంచడంలో మీరు కాంగ్రెస్స్ ను మించిపోయారని విమర్శించారు. ఆ మహానుభావుడి మాటలు నమ్మి సిలిండర్ లు తీసుకున్నారు.. కట్టెల పొయ్యి ఉన్న వారికి బలవంతంగా సిలిండర్ లను అంటగట్టి మరీ పేదలను గ్యాస్ కు అలవాటు చేసి నేడు ధరలు పెంచేశారని విమర్శించారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నేడు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.

75సంవత్సరాల స్వతంత్ర పాలనలో… సిలిండర్ పై సంవత్సరానికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందను, బిజెపి అధికారంలోకి రాకముందు… 8 సంవత్సరాల క్రితం కేవలం 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 1160 రూపాయలకు చేరుకుందనీ అన్నారు. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరనీ, గడిచిన 8 సంవత్సరాలలో సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోడీ అని అన్నారు. ధరల పెంపు పైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం… పేద మధ్యతరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదనీ,పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదనీ అన్నారు. అదానికి దోచి పెట్టేందుకు పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపారనీ, మన రక్తపు ముద్దను మోడీ గుజరాత్ కు దోచిపెడుతున్నారనీ అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1160 నుంచి 8 వందలకు తగ్గించాలనీ, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపబోమనీ హెచ్చరించారు. గ్యాస్ పెంపు ధరలను దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంన్నారని, పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందనీ తెలిపారు.

Related posts

తిరుచానూరు లో దర్శన ఏర్పాట్ల పర్యవేక్షణ

Satyam NEWS

కేంద్రం దిగి వ‌చ్చే దాకా పోరాటం ఆపొద్దు

Sub Editor

ఫిషింగ్ హార్బర్ కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment