ఖమ్మం జిల్లాలోని హోంగార్డు కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అందచేశారు. విద్య రంగంలో ప్రతిభతో రాణిస్తున్న హోంగార్డు కుటుంబసభ్యులోని విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్, అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోన హోంగార్డులకు మంజురైన మెడికల్ బిల్లుల మొత్తాన్ని పోలీస్ కమిషనర్ అందజేశారు. అదేవిధంగా విధి నిర్వహణలో భాగంగా మరణించిన హోంగార్డు బాధిత కుటుంబాలకు నగదు చెక్కులను పోలీస్ కమిషనర్ వారి కుటుంసభ్యులకు అందజేశారు. మొత్తం 45 మంది హోంగార్డు కుటుంబాలకు రూ. 4,57,000/- (నాలుగు లక్షల యాబై ఏడు వేలు) అందజేశారు. హోం గార్డ్ కుటుంబాలకు తాము యెల్లప్పుడు అందగా వుంటామని కమిషనర్ చెప్పారు. కార్యక్రమంలో RI శ్రీశైలం , హోంగార్డు అసోసియేషన్ నాయకులు రఫీ పాల్గొన్నారు.
previous post
next post