ఖమ్మం మున్నేరు వరద ముంపుకు గురైన నిర్వాసితులకు ఖమ్మం దంసలావురం లోని కందగట్ల ఫంక్షన్ హాల్ నందు ఆర్ధిక సాయం చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు మంత్రి పువ్వాడ విజ్ఞప్తి మేరకు రూ. కోటి వితరణ చేసిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి,
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోడలు అపర్ణ, తన తాత కంపెనీ నుండి రూ .50 లక్షలు వితరణ మొత్తం కలిపి రూ.1.50 కోట్ల విలువైన చెక్కులను రెండు రోజుల పాటు అర్హులైన 1,718 మంది కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, స్థానిక కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు, నాయకులు ఆళ్ళ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.