ములుగు మండలంలోని జాకారం గ్రామానికి చెందిన రుద్రబోయిన రఘుపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి 1998 పదవ తరగతి బ్యాచ్, అబ్బాపూర్ జెడ్పిహెచ్ఎస్ కి చెందిన మిత్రులు 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్న వయస్సులో మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. అతనికి ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్నారని, పెద్దగా ఎలాంటి ఆస్తి పాస్తులు లేకపోవడంతో ఆ కుటుంబానికి చేదోడు వాదొడు గా క్లాస్ మెట్స్ అందరూ కలిసి ఎవరికి వారు వారికి తోచినంత ఆర్థిక సహాయం అందించారు.
రఘుపతి కుటుంబానికి అండదండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద శ్రీనివాస్, సామంతుల కోటి, పంచగిరి శ్రీనివాస్,కొంగరి మహేందర్,రాస రాజేందర్,యార కుమారస్వామి, భాస్కర్,రంజిత్ లతో పాటు అబ్బాపూర్, జాకారం,వెంకటేశ్వర్లు పల్లి,కొత్తపల్లి మిత్రులు పాల్గొన్నారు.