38.2 C
Hyderabad
May 1, 2024 19: 12 PM
Slider వరంగల్

రోడ్డు ప్రమాద మృతులకు ఆర్థిక సహాయం

#road accidentn

ములుగు మండలంలోని జాకారం గ్రామానికి చెందిన రుద్రబోయిన రఘుపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి 1998 పదవ తరగతి బ్యాచ్, అబ్బాపూర్ జెడ్పిహెచ్ఎస్ కి చెందిన మిత్రులు 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్న వయస్సులో మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. అతనికి ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్నారని, పెద్దగా ఎలాంటి ఆస్తి పాస్తులు లేకపోవడంతో ఆ కుటుంబానికి చేదోడు వాదొడు గా క్లాస్ మెట్స్ అందరూ కలిసి ఎవరికి వారు వారికి తోచినంత ఆర్థిక సహాయం అందించారు.

రఘుపతి కుటుంబానికి అండదండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద శ్రీనివాస్, సామంతుల కోటి, పంచగిరి శ్రీనివాస్,కొంగరి మహేందర్,రాస రాజేందర్,యార కుమారస్వామి, భాస్కర్,రంజిత్ లతో పాటు అబ్బాపూర్, జాకారం,వెంకటేశ్వర్లు పల్లి,కొత్తపల్లి మిత్రులు పాల్గొన్నారు.

Related posts

24 గంటలు గడవకముందే మళ్లీ భారీ చోరీ

Satyam NEWS

కార్మికులు

Satyam NEWS

పల్నాడు మెడికల్ కాలేజీ నిర్మాణానికి రంగం సిద్ధం

Satyam NEWS

Leave a Comment