రంగారెడ్డి జిల్లా ఆమనగల్ నుండి కర్కాల్ పహాడ్ వెళుతున్న టాటా ఏసీ వాహనము అగ్నిలో దగ్ధం అయ్యింది.
వివరాల్లోకి వెళితే ఆమనగల్ నుండి కర్కాల్ పహాడ్ పాల క్యాన్లతో వెళ్తున్న టాటా ఏసీ వాహనము విఠాయిపల్లి కోనాపూర్ జాతీయ రహదారి మార్గమధ్యలో ఇంజన్ వేడెక్కి మంటలు చెలరేగినట్లు మంటలు గ్రహించిన డ్రైవరు వెంటనే వాహనాన్ని ఆపి క్రిందికి దిగినట్లు స్థానికులు తెలిపారు.
వాహనంలో ఉన్న పాలు వాహనము పూర్తిగా అగ్నిలో ఆహుతి అయినట్లు, ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.