కడప జిల్లా లో పోలీసు తనిఖీల్లో భారీగా వెండి నగలు దొరికాయి.
ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి 4 రోడ్ల కూడలి వద్ద మంగళవారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టగా కడప కు చెందిన మనోహర్ సింగ్ (44) బిల్లు లు లేకుండా తరలిస్తున్న రూ. 3.8 లక్షల విలువైన 5.655 కిలోల వెండి పట్టీలు, వెండి కడ్డీలతో పాటు రూ.2.30 లక్షల నగదు దొరికింది.
తదుపరి చర్యల నిమిత్తం నగదు, వెండి, ఆభరణాలు కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ పోలీసులు అప్పగించారు.
అక్రమంగా తరలిస్తున్న వెండి, నగదు ను పట్టుకోవడంలో కృషి చేసిన ప్రొద్దుటూరు రూరల్ ఎస్.ఐ సి. లక్ష్మి నారాయణ, కానిస్టేబుల్ లు నాగాంజనేయులు, తిరుమలయ్య, డి.లక్ష్మి నారాయణ, ఎం. రాజశేఖర్ ల ను ప్రొద్దుటూరు డి.ఎస్.పి ప్రసాద రావు ప్రత్యేకంగా అభినందించారు.