29.7 C
Hyderabad
April 29, 2024 08: 13 AM
Slider ముఖ్యంశాలు

కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి

#covid

మహారాష్ట్రలో కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయతే కేసులతో పాటు మరణాలు పెరగడం మరింత అలర్ట్ కావాల్సిన పరిస్థితి. మహరాష్ట్రలో ఒక్కరోజే 1115 కొత్త కేసులు నమోదవడంతో పాటు 9 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5421కి చేరింది. ఒక్క ముంబైలోనే 1577 కేసులు ఉన్నాయి. దేశంలో 7830 కేసులు నమోదయ్యాయి.

దాదాపు 7 నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదవ్వడం ఇది తొలిసారి. మరో వైపు వచ్చే రెండు వారాల్లో అంటే.. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు.. 15 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే సంచలన విషయాన్ని ప్రకటించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఏప్రిల్ 12వ తేదీ బుధవారం.. దేశంలో కరోనా కేసులపై రివ్యూ నిర్వహించిన తర్వాత.. ఈ మేరకు అంచనాకు వచ్చారు అధికారులు.

Related posts

Thank God: కులం రంగు పులిమే అవకాశం రాలేదు

Satyam NEWS

ఆధ్యాత్మిక రాజధానిలో ఎంజీఆర్ బంపర్ డ్రా

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment