26.7 C
Hyderabad
May 3, 2024 08: 50 AM
Slider ప్రపంచం

జర్మనీలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి

frunkfruit

జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ సిటీ లో (భారత కాలమానం ప్రకారం) నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక వ్యక్తి అక్కడ ఉన్న వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తి కోసం జల్లెడపడుతున్నారు.

కాల్పులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అతడు ఎందుకు కాల్చాడు అనే విషయం కూడా ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. హనయు లోని బార్ వద్ద ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సహాయ బృందాలు అక్కడి ప్రజలకు సహాయ చర్యలు ప్రారంభించాయి.

Related posts

తిరుపతిలో ఈ నెల 30న గో మహాసమ్మేళనం

Satyam NEWS

జగన్ సేవలో తరించిన 8 మంది అధికారులు ఏ క్షణమైనా ఔట్‌!

Satyam NEWS

నదుల అనుసంధానంపై చంద్రబాబు అసత్యప్రచారం

Satyam NEWS

Leave a Comment