తమిళనాడు లోని తిరుపూర్ జిల్లా అవంతశి పట్టణానికి సమీపంలో ఓ కంటైనర్ లారీతో కేరళ రాష్ట్ర ప్రభుత్వ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మహిళలతో సహా పంతొమ్మిది మంది మృతి చెందారు. బెంగళూరు నుంచి తిరువనంతపురం వెళుతున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ బస్సు కోయంబత్తూర్-సేలం హైవేపై ఎదురెదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన సంభవించిందని పోలీసులు తెలిపారు.
తెల్లవారు జామున 4.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం ఒక్క సరిగా అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. బస్సులో ఉన్నవారంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో ఉన్న 48 మంది ప్రయాణికుల్లో 19 మంది అక్కడికక్కడే మరణించగా, మిగిలిన నలుగురికి గాయాలు అయ్యాయి.