లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పలువురు పేదలకు ఫిట్ ఇండియా ఫౌండేషన్ బాసటగా నిలిచింది. నల్లగొండ మండలం ఆనంతారం గ్రామంలో పది పేద కుటుంబాల వారికి బియ్యం, నిత్యావసరాలు అందచేశారు. లాక్ డౌన్ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించిన క్రమంలో పేదలను ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ప్రస్తుత విపత్కర పరిస్ధితులో దేశ వ్యాప్తంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు స్వామి, అడ్వైజర్ వై.వి.ప్రతాప్, గ్రామ సర్పంచ్ వీర మణెమ్మ, సభ్యులు మల్లీశ్వరి, నర్సింహారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.