23.2 C
Hyderabad
May 8, 2024 00: 13 AM
Slider నల్గొండ

ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు

#Fit India Foundation

లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పలువురు పేదలకు ఫిట్ ఇండియా ఫౌండేషన్ బాసటగా నిలిచింది. నల్లగొండ మండలం ఆనంతారం గ్రామంలో పది పేద కుటుంబాల వారికి బియ్యం, నిత్యావసరాలు అందచేశారు. లాక్ డౌన్ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించిన క్రమంలో పేదలను ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ప్రస్తుత విపత్కర పరిస్ధితులో దేశ వ్యాప్తంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు స్వామి, అడ్వైజర్ వై.వి.ప్రతాప్, గ్రామ సర్పంచ్ వీర మణెమ్మ, సభ్యులు మల్లీశ్వరి, నర్సింహారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం

Satyam NEWS

ఆనంద క్షణాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి

Satyam NEWS

పి సి.సి. కార్యదర్శిగా ఈడ్పుగంటి సుబ్బారావు

Satyam NEWS

Leave a Comment