ఈ నెల 21 రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మూడు సార్లు రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి అయ్యాయి.
చివరి విడతగా నాల్గోసారి ఎన్నికలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. దాదాపు 250 పోలింగ్ కేంద్రాల్లో సంబంధించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు రాష్ట్ర డీజీపీ నుంచీ ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు గా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో సమస్యాత్మక గ్రామాలను ముందు గానే గుర్తించిన జిల్లా ఎస్పీ రాజకుమారీ.. తన సిబ్బంది తో ఇప్పటినుంచే ఆయా గ్రామాలలో పికటింగ్ ఏర్పాటు చేసారు.
విజయనగరం డీఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో.. రూరల్ సీఐ మంగవేణి… గుర్ల ఎస్ఐ లీలావతి లు ఇతర పోలీసు సిబ్బంది…. గంట్యాడలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.