పేదలకు అన్నదానం చేయడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుందని లయన్స్ క్లబ్ ఉమ్మడి నల్గొండ,ఖమ్మం జిల్లాల చైర్మన్ సుందరి నాగయ్య,పోంచర్ల(హుజూర్ నగర్)లైన్స్ క్లబ్ అధ్యక్షుడు పిన్నని కోటేశ్వరరావు, లయన్స్ క్లబ్ క్యాబినెట్ అసిస్టెంట్ సెక్రటరీ మాశెట్టి శ్రీనివాసు అన్నారు.
సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుందరి నాగయ్య ఆర్థిక సహకారంతో 300 మంది రోగులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అన్న సూక్తితో పది మందికి సహాయ పడాలని అన్నారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం ఎంతో గొప్పదని,ఆపదలో ఉన్న వారికి ముఖ్యంగా రోగులకు అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రపంచం లోనే 220 దేశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని,అందులో భాగంగానే హుజూర్ నగర్ (పోంచర్ల) లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోలా నాగేశ్వరరావు, రాంప్రసాద్ గౌడు,పిన్నని సంపత్ వర్మ, మహిళా ప్రతినిధి పిన్నని ప్రభావతి,జోనల్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,నాగేంద్రరావు, కితా వెంకటేశ్వరరావు,పద్మావతి,ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కరణ్ కుమార్,వెంకటరెడ్డి,వెంకటప్పిరెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్