ములుగు జిల్లా మేరు సంఘం నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా అడుహాక్ కమిటీ కన్వీనర్, జిల్లా ఎన్నికల పరిశీలకుడు తాళ్ల సంపత్ కుమార్ మేరు తెలిపారు. ములుగు జిల్లా మేరు సంఘం అధ్యక్షుడు గా నన్నే లక్ష్మణ్ మేరు, ప్రధాన కార్యదర్శి గా కీర్తి రాజు మేరు, కోశాధికారి గా పొడిశెట్టి రవీందర్ మేరు, ఉపాధ్యక్షులు గా కొండ విజయ్,గట్ల రవి,ముప్పిడి శ్రావణ్ కుమార్,కర్నె రతన్,పొడిశెట్టి వినయ్ కుమార్, కార్యదర్శులు గా పొడిశెట్టి కొమురయ్య, ర్యాకల సురేష్, గూడూరు పవన్ కుమార్, బొమ్మిదేని రమేష్, రాయబారపు రమేష్, నిర్వాహక కార్యదర్శులు గా కర్నె నాగరాజు, గూడూరు యాదగిరి,పొడిశెట్టి మహేందర్, పొడిశెట్టి సర్దార్, మాడిశెట్టి అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మేరు సంఘం నాయకులు గట్ల సదానందం, ప్రకాష్, సుధాకర్, తిరుపతి, రమేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post