సిటీ స్కానింగ్ సెంటర్ లో కరోనా పరీక్ష కోసం 3 వేలుకు మించి వసూలుచేసినట్టు ఎక్కడైనా పిర్యాదు అందితే వెంటనే స్కానింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు.
కోవిడ్ పరీక్షలు నిర్వహణకు ప్రవేట్ స్కానింగ్ సెంటర్స్ కు 3000 రూపాయలు ధరను నిర్ధారిస్తూ నేడు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
3000 రూపాయలకు మించి ఎక్కువ డిమాండ్ చేస్తూ కరోనా అనుమానితుల నుండి వసూలు చేస్తే 1902కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలిపారు.
ప్రతి ప్రవేట్ స్కానింగ్ సెంటర్ లో ప్రభుత్వం నిర్ధారణ చేసిన 3వేలు రూపాయలు ధరను తెలిపే విధంగా అందరికి కనిపించడం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.