28.7 C
Hyderabad
April 28, 2024 04: 33 AM
Slider ముఖ్యంశాలు

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

cbn 11

కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులనుంచి దృష్టి మళ్లించడానికి జగన్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రజలకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని, వ్యాధి నిర్ధారణ ఫలితాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

ఆక్సిజన్ దొరక్క, మందులు లేక, వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నింటినీ దారి మళ్ళించేందుకు నిన్న గుంటూరులో ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని, నేడు విశాఖలో పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేశారని ఆయన అన్నారు.

రేపు రాయలసీమలో ఏముంటుందో తెలీదు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చంద్రబాబు అన్నారు.

Related posts

ఫ్లై ఓవర్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన కేటీఆర్

Bhavani

కుంభకోణం పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలి

Satyam NEWS

భజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గణనాథుని కి ఘనంగా పూజలు

Satyam NEWS

Leave a Comment