కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులనుంచి దృష్టి మళ్లించడానికి జగన్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రజలకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని, వ్యాధి నిర్ధారణ ఫలితాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
ఆక్సిజన్ దొరక్క, మందులు లేక, వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నింటినీ దారి మళ్ళించేందుకు నిన్న గుంటూరులో ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని, నేడు విశాఖలో పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేశారని ఆయన అన్నారు.
రేపు రాయలసీమలో ఏముంటుందో తెలీదు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చంద్రబాబు అన్నారు.