లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేకపోవడంతో సొంత ఊరికి బయలు దేరిన వలస కూలీలను వరంగల్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ MJ అక్బర్ ఆదుకున్నారు. కాలినడకన మధ్యప్రదేశ్ కు వెళ్లిపోతున్న వారిని కరీంనగర్ సమీపంలో వారిని అటవీ శాఖ సిబ్బంది చూసి సమాచారం అందించడంతో అక్బర్ తక్షణమే స్పందించారు.
వారికి నచ్చచెప్పి అక్కడే ఉండాల్సిందిగా కోరారు. కరీంనగర్ సమీపంలో ఉన్న కార్మికులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను అటవీశాఖ అధికారులు అందించారు.