సమాజ హితం కోరి సేవలను అందిస్తున్న వారిలో జర్నలిస్టుల పాత్ర చిరస్మరణీయమైనది స్థానిక ఎంపీపీ కొలను సునీత వెంకటేశం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కు బియ్యం పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారోనా వైరస్ విస్తరణ సమయంలో ఎలాంటి భయం లేకుండా వార్తా సేకరణ చేపట్టడం అభినందనీయమని అన్నారు.
తెరాస యువజన విభాగం మండల అధ్యక్షుడు వినయ్ కుమార్ కోడిగుడ్లు పంపిణీ చేయగా, తాళ్లవెళ్ళాంల ఎంపిటిసి వడ్డేపల్లి లక్ష్మిపతి రూ. 500 నగదు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లాజర్, పలువులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.