భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువరాజ్ను హర్యానా పోలీసులు అరెస్ట్ సంచలనం సృష్టించింది. కాగా, యువరాజ్ అరెస్ట్కు అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. గతేడాది భారత క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి యువరాజ్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడాడు. క్రికెటర్ చాహల్ పై సరదాగా కామెంట్ చేశారు యూవీ.
చాహల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని.. బాంగీ మనుషుల్లా వీళ్లకు పని పాటా లేదా? అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే యువరాజ్పై హర్యానా లో కేసు నమోదైంది. హిందీలో బాంగీ అంటే దళిత వర్గానికి చెందిన ఓ కులాన్ని పిలుస్తారు. యువరాజ్ సింగ్ అలాంటి పదాన్ని వాడడంతో వారిని కించపరిచాడని అనే ఆరోపణలు వచ్చాయి.