కరోనా వ్యాధితో అకాల మరణం పొందిన జర్నలిస్టుల సోదరులకు రాజన్న సిరిసిల్లా జిల్లా టీయూడబ్ల్యూజే వేములవాడ ప్రెస్ క్లబ్ (హెచ్ 143) ఘన నివాళి అర్పించింది.
కరోనా మహమ్మారితో నేడు ఒకే రోజు నలుగురు జర్నలిస్ట్ లు మరణించారని రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా తెలిపారు.
ఇది ఎంతో బాధాకరమని ఆయన అన్నారు.
మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ మరణించిన జర్నలిస్టులకు ఆత్మ శాంతి కలగాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
అకాల మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.