రాజన్న సిరిసిల్లా జిల్లా లోని వేములవాడలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి.
ఎనిమిదవ రోజు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి వార్లు నంది, హనుమంతు వాహనాలపై విహరించారు.
అంతరాలయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు.