గత 24 రోజులుగా ప్రగతి భవనంలోనే ఉన్న 4 గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు బయటకు వచ్చారు. బీజేపీ నేతలు ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిoదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం 4 +4 భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ఇచ్చారు. ఆనాటి నుండి ప్రగతి భవన్కే పరిమితమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బాధితులుగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు లను మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు ముఖ్యమంత్రి ఒకసారి తీసుకెళ్లి అక్కడి ప్రజలకు పరిచయం చేశారు. మళ్ళీ వారిని ప్రగతి భవంకే పరిమితం చేశారు. ఆ నలుగురు ఇన్ని రోజులు ప్రగతి భవన్ కె పరిమితం కావటం విమర్శలకు తావిస్తోంది. అనేక చోట్ల ఎంఎల్ఏ లు కనిపించటంలేదంటూ ఫిర్యాదులు కూడా ఇచ్చారు.