రాజ్యసభ సభ్యులడు సంతోష్ కుమార్ కరోనా కష్ట కాలంలో పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక తన స్వంత గ్రామంలో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్ 8వ రోజుకు చేరింది.
సుమారు 100 మంది వలస కార్మికులు భోజనాలు చేశారు. ఈ క్యాంప్ లాక్డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని TRS రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు తెలిపారు. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ TRS అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, TRS నాయకులు ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, గుండ్ల సాయబు పాల్గొన్నారు.