Slider వరంగల్

మృతుని కుటుంబ సభ్యులకు బాల్య స్నేహితుల ఆర్ధిక సాయం

#mulugu friends

తమ తోటి స్నేహితుని కుటుంబ సభ్యులకు  ఆర్దికంగా చేయూత ను అందించి స్నేహం  గొప్పతనాన్ని మరోసారి  గుర్తు చేశారు ఈ స్నేహితులు.

ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామానికి చెందిన  1994- 95 బ్యాచ్ కు చెందిన  స్నేహితులు ఈ సాయం అందించి పదుగురికి ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన దుడపాక రాంచందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న ఆయనతో పాటు  జంగాలపల్లి జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి (1994 -95 )  చదువుకున్న  చిన్ననాటి మిత్రులు  ఆదివారం   జంగాలపల్లి కి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, 50 కేజీల ఫైన్  రైస్, 3000 రూపాయల నగదును వారి  కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో  మృతుడు రాంచందర్ స్నేహితులు వేల్పుల రమేష్ యాదవ్,  సాదు రవి, కూనూరు  మహేందర్ గౌడ్, ముత్యాల కుమారస్వామి, రేవూరి వాసులు, వీరన్న గౌడ్ తదితరులు ఉన్నారు.

Related posts

క్రూడ్ ఫెలో: కాపు కాశాడు కాటు వేద్దామని చూశాడు

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

రెండు రోజుల్లో పోడు పట్టాల ప్రక్రియ పూర్తి

mamatha

Leave a Comment