40.2 C
Hyderabad
May 6, 2024 16: 40 PM
Slider వరంగల్

మృతుని కుటుంబ సభ్యులకు బాల్య స్నేహితుల ఆర్ధిక సాయం

#mulugu friends

తమ తోటి స్నేహితుని కుటుంబ సభ్యులకు  ఆర్దికంగా చేయూత ను అందించి స్నేహం  గొప్పతనాన్ని మరోసారి  గుర్తు చేశారు ఈ స్నేహితులు.

ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామానికి చెందిన  1994- 95 బ్యాచ్ కు చెందిన  స్నేహితులు ఈ సాయం అందించి పదుగురికి ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన దుడపాక రాంచందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న ఆయనతో పాటు  జంగాలపల్లి జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి (1994 -95 )  చదువుకున్న  చిన్ననాటి మిత్రులు  ఆదివారం   జంగాలపల్లి కి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, 50 కేజీల ఫైన్  రైస్, 3000 రూపాయల నగదును వారి  కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో  మృతుడు రాంచందర్ స్నేహితులు వేల్పుల రమేష్ యాదవ్,  సాదు రవి, కూనూరు  మహేందర్ గౌడ్, ముత్యాల కుమారస్వామి, రేవూరి వాసులు, వీరన్న గౌడ్ తదితరులు ఉన్నారు.

Related posts

దళిత జర్నలిస్టులకు దళిత బంధు అమలు

Satyam NEWS

హుజూర్ నగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి

Satyam NEWS

బాలినేనిని మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment