కడప జిల్లా పులివెందుల లో వివేకా హత్య కు ఉపయోగించిన ఆయుధాల కోసం ఆదివారం 12 గంటలుగా అన్వేషణ కొనసాగుతున్నది.
పులివేందుల రోటరీపురం వాగులో మురికి నీరు పూర్తిగా తొలగించి సాగిస్తున్న అన్వేషణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వ్యర్థాలను తొలగించేందుకు ఇరవై మంది మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయినా సాధ్య పడకపోవడంతో జెసీబీ యంత్రాల సహాయంతో వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
మొదటి రోజు ఏనిమిది గంటల పాటు, రెండవ రోజు నాలుగు గంటల పాటు ఆయుధాల కోసం అన్వేషణ జరిగింది. సాయంత్రానికి ఆయుధాలు బయట పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జెసీబీ యంత్రాలతో వ్యర్థాలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది ఆయుధాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీబీఐ కష్టడీలో ఉన్న సునీల్ యాదవ్ న్యాయ వాదుల సాయంతోతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సునీల్ యాదవ్ తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పీటీషన్ దాఖలు చేయనున్నారు.