40.2 C
Hyderabad
April 29, 2024 17: 50 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి

#TPCC President

సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ పట్టణంలోని 7వ, వార్డులో అభివృద్ధి పనులకు  టిపిసిసి చీఫ్ నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో చేపట్టిన సిసి రోడ్లు, సిసి డ్రైన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణానికి మెరుగైన అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, బాచిమంచి గిరిబాబు పాల్గొన్నారు.

ఇంకా ఐఎన్టియుసి నాయకులు యరగాని నాగన్న గౌడ్, జక్కుల మల్లయ్య, వీరారెడ్డి,బచ్చలి కూర బాబు,వేముల నాగరాజు వార్డు కౌన్సిలర్లు వేముల వరలక్ష్మి, కస్తాల శ్రవణ్ కుమార్, ములకలపల్లి రామ గోపి, తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

వర్గ పోరాటాలు తీవ్రతరం చేయాలి

Murali Krishna

హుజూర్ నగర్ లో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

Satyam NEWS

ఐఎన్​టీయూసీ అధ్యక్షుడిగా శ్రీనివాస్​

Satyam NEWS

Leave a Comment