ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కే ఎస్ జవహర్ రెడ్డి కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో జవహర్ రెడ్డి కి స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ హిమాంస్ శుక్ల, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.