మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామములో అమరావతి రాజధాని కృష్ణాయపాలెం ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 436 వ రోజు నిర్వహించారు.
మూడు రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కృష్ణాయపాలెం గ్రామంలో ఆంధ్రుల రాజధాని అమరావతి విశాఖఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ రైతులు, రైతు కూలీలు మరియు మహిళలు పాల్గొన్నారు