ఎ.ఐ.సి.సి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రి మెటర్నరీ వార్డులో బాలింతలకు పండ్లు,పాలు,బ్రేడ్ పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, మాజీ జడ్పీటిసి గల్లా వెంకటేశ్వర్లు,బాచిమంచి గిరిబాబు,పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,వార్డు కమిటీ అధ్యక్షులు ముషం సత్యనారాయణ,పోతనబోయిన రామ్మూర్తి,అంజనపల్లి సుదర్శన్,కోల మట్టయ్య,చింతకాయల రాము,షేక్ ఉద్ధoడు,పెద్దబ్బాయ్,చప్పిడి సావిత్రి, దొండపాడు గోపిరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,గడ్డం వెంకటమ్మ,ముల్కలపల్లి ఠాగూర్,దాసరి రాములు,బొల్లెద్దు కార్తీక్,చిలక బత్తిన జయరాజు,బొల్లెద్దు నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం దేశ ప్రజలను మత విద్వేషాలకు దూరంగా ప్రేమ, ఐక్యమత్యంతో ముందుకు సాగేలా ఆలోచనలో పడవేసిందని అన్నారు. జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో,దేశ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ భేరి మోగిస్తుందని,భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ నియామకం జరగడం తథ్యమని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ కరుణ్ కుమార్, గైనకాలగిస్ట్ డాక్టర్ సింధు,డాక్టర్ దశరధ, స్టాఫ్ నర్స్,ఎ ఎన్ ఎం లు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్