27 C
Hyderabad
May 10, 2024 05: 14 AM
Slider మహబూబ్ నగర్

పదవ తరగతి విద్యార్థులకు సన్మానం

#tenthclass

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా మాధారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఉరుకొండ మండలంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో మంచి గ్రేడు ఫలితాలు సాధించిన మండల టాపర్ లకు క్లాస్ మేట్ క్లబ్ కల్వకుర్తి డివిజన్ ఆధ్వర్యంలో  1116 నగదు బహుమతితో పాటు శాలువా మెడల్స్ తో ఘనంగా సన్మానించారు.

ఉరుకొండ పాఠశాలకు చెందిన  జె.అఖిల  ఉరుకొండ పెట్ కు చెందిన బి.అంజలి మాధారం కు చెందిన ప్రీతి  రవళి  మండలంలో టాపర్ లు గా నిలిచారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు బాదం రాఘవేందర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి విద్యార్థికి చదువే ముఖ్యమని చదువు లేకుంటే జీవితంలో రాణించలేమని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే కష్టపడి నిరంతరంగా శ్రమించి చదువుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో విద్యార్థుల కంటే విద్యార్థినిలే అధిక ఉత్తీర్ణత శాతం పెరిగిందని అమ్మాయిలు ఎందులో తీసుపోరనేది జగమెరిగిన సత్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో  ఉరుకొండ  మండల వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి ఉపాధ్యాయులు చంద్రశేఖర్ జకీనాలపల్లి  క్లాస్ మేట్ క్లబ్ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసింహారావు డివిజన్ అధ్యక్షులు  బాదం రాఘవేందర్  ప్రధాన కార్యదర్శి శివ్వ శ్రీనివాస్   ప్రధానోపాధ్యాయులు గోపాల్. బాలయ్య  క్లబ్ సభ్యులు మాణిక్యం ఉపాద్యాయులు శ్రీనివాసరెడ్డి లోక్య కృష్ణ వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజురాబాద్ లో జాగింగ్ ట్రాక్ కు స్థలం సిద్ధం

Satyam NEWS

అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించండి

Satyam NEWS

రక్తదాన శిబిరాలను కూడా మూర్ఖులు విమర్శిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment