జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలను నిరసిస్తూ మల్దకల్ మండలం హెడ్ క్వార్టర్ నందు బిక్షాటన కార్యక్రమం నిర్వహించి బియ్యం సేకరించారు. అంతకుముందు స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి బిక్షాటన ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు, అన్నిస్థాయిలలో చైర్మెన్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, యూత్ సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.