పెద్దపల్లిపోలీస్ స్టేషన్ పరిధిలోనీ చందపల్లి, గాంధీనగర్ లో కోళ్ల పందాల స్థావరం పై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. అనంతరం జూదం ఆడుతున్న ఐదుగురిని, 5 బైక్ లు, 2 కోళ్లు, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.సత్యనారాయణ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ, సిబ్బంది తో కలిసి మండలంలోని చందపల్లి, గాంధీనగర్ శివారు చెట్లల్లో కోళ్ల పందాలు ఆడుతున్నారు అనే పక్కా సమాచారం మేరకు దాడి చేశారు.