కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి మురికి వాడలు శుభ్రంచేసి అన్ని మతాలు ,కులాలు ఒకటేనని చాటిచెప్పిన మహానుభావుడు మన గాంధీజీ అని మల్లాపూర్ డివిజన్ కార్పోరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అన్నారు. శనివారం జాతిపిత మహాత్మగాంధి 152 వ జయంతి వేడకలు పురస్కరించుకుని మల్లాపూర్ డివిజన్ లో మహాత్మగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మల్లాపూర్లో 30 సవత్సరాల క్రితం గాంధీ విగ్రహాన్ని విలేజ్కి చెందిన కేశవరం విశ్వనాధం ఆవిష్కరించి ప్రతిష్టించారు. ఆ సందర్బంగా కేశవరం విశ్వనాధంను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్కుమార్రెడ్డి, కుంటి కృష్ణ, హమాలి శ్రీను, తండా వాసుగౌడ్, రాపోలు సతీష్, రవికుమార్, దర్గయ్య, బూసానిరఘు,బాసిత్ఖాన్, రాపోలు శ్రీను, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి కోటేశ్వరి, తులస,ి ప్రభాకర్రెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.