ఉప్పల్ నల్ల చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సోమవారం రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు , రటాఫిక్ ఇబ్బందులను ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలకు సిద్దంగా ఉండాలని సూచించారు. గంతలు ,అక్కడక్కడ కంకర తేలిన రోడ్లను వెంటనే మరమత్తులు చేపట్టాలని జీహెచ్ఎమ్సీ అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ సిఐ గోవిందరెడ్డి, ట్రాఫిక్ సిఐ లు కాశీవిశ్వనాధ్, యాదయ్య పోలీస్ అధికారలు తదితరలు పాల్గొన్నారు.