సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 22వ,వార్డులోని శ్రీ లక్ష్మీనరసింహ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లికార్జున రావు మాట్లాడుతూ సకల విఘ్నాలు తొలగించే ప్రమద గణాధిపతి వినాయకుని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని,ఏ కార్యం తలపెట్టినా ప్రధమంగా గణపతిని పూజించాలని,ఆ స్వామి అనుగ్రహంతో విఘ్నాలు తొలగి నెరవేరవలసిన కార్యం నిర్విఘ్నంగా సాగుతుందని అన్నారు.ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం వలన గ్రామం,రాష్ట్రం,దేశం సుభిక్షంగా ఉంటుందని,తద్వారా ప్రజలు సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు.గణపతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు,ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతా పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
గణపతి ఉత్సవ నిర్వాహక కమిటి సభ్యులు పూలమాల,శాలువాతో మల్లికార్జున రావు ను సన్మానించారు.అనంతరం అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు సలగంటి జ్ఞానయ్య,ఎన్నం వరప్రసాద్,ఎన్నం వేణుగోపాల్,సమ్మెట సుబ్బరాజు,సలిగంటి గణేష్,ఎన్నం పద్మ, బత్తిని వెంకటమ్మ,బూదూరు పద్మ, యాకయ్య,గొట్టిముక్కుల రాములు, నేపాల్,ఎన్నం కేశవ,మహిళా భక్తులు,భక్తురాండ్రు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్