అక్రమ సంపాదన కోసం వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ చరిత్రను దిగజారుస్తున్నారన్నారని, రాష్ట్రంలో రాజ్యమేలుతున్న గంజాయి మాఫియా పై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే నాడు వరి పంట గుర్తుకొచ్చేదని వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి గుర్తుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల వైసిపి పాలనలో గంజాయి,గుట్కా,మైన్, వైన్, ఇసుక,ల్యాండ్ మాఫియాతో వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి నెట్టి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారని డా౹౹చదలవాడ ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో టిటిడి కాంట్రాక్ట్ ఉద్యోగి గంజాయి సరఫరాలో వైసీపీ నాయకులకు వాటా ఉందని తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రను వైసీపీ నాయకులు మసకబారుస్తున్నారని డా౹౹చదలవాడ మండిపడ్డారు.
గురజాల నియోజకవర్గం దైద గ్రామంలో గంజాయి సాగులో వైసీపీ నాయకులకు వాటా ఉందన్నారు. వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు వైసీపీ నాయకుల ప్రోత్బలంతో వైసీపీ గుండాలు సాగు చేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను యూస్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిపారన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను మాదకద్రవ్యాల మాఫియాలో నెంబర్ వన్ స్థానంలో నిలిపారని డా౹౹చదలవాడ ఎద్దేవా చేశారు. గంజాయి ఎక్కడ పట్టుబడిన గంజాయి సరఫరా కేంద్ర బిందువు ఆంధ్రప్రదేశ్ ను సూచిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.