అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు పిలుపు మేరకు 41 వ టీడీపీ అవిర్భ వేడుకలు ఆరు మండలాల్లో ఘనంగా నిర్వహించారు. రాజంపేట లో పట్టణ బైపాస్ రోడ్డు ఈ కార్య క్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ భారీ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూల మాల వేశారు.కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి,స్వీట్స్ పంపిణీ చేసారు.జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.పాత బస్ స్టాండ్ లో టీడీపీ జెండా ఎగుర వేశారు.ఒంటిమిట్ట లో,సిద్దవటంలో,సుండుపల్లె, వీరపల్లె,నందలూరు మండలాల్లో కూడా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకగా నిర్వహించారు.
previous post