హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చాక్లెట్ ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ని నేడు బాల నగర్ ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. సనత్ నగర్ , ఫతే నగర్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్క సమాచారం తో పోలీసులు అక్కడున్న పాన్ షాప్ లను తనిఖీ చేశారు.
దాంతో 1 కిలో 200 గ్రాముల గంజాయి చాక్లెట్ లు దొరికాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. జయంత్ ప్రధాన్(41) అనే వ్యక్తి ఇక్కడ గంజాయి విక్రయిస్తున్నాడని, అతనికి ఒరిస్సా కి చెందిన ఆకాష్ దాస్ అనే వ్యక్తితో కలిసి ఈ చీకటి వ్యాపారం చేస్తున్నాడని ఎక్సైజ్ సిఐ జీవన్ కిరణ్ తెలిపారు.