డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనుకున్నాడు సాయి నిఖిల్. అందుకే కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నెల్లూరు లో ని ఒక వ్యాపార వేత్త కొడుకును, కూతురిని కిడ్నాప్ చేస్తాను అంటూ బెదిరించాడు. అలా జరగకుండా ఉండాలంటే 2 కోట్లు డిమాండ్ చేశాడు. దాంతో ఆ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసును పరిశోధించి సాయి నిఖిల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
ఈ విషయాన్ని నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుడు సైదాపురం మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన యల్లంరాజు సాయి నిఖిల్ గా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.