విజయనగరం జిల్లా మరోమారు నేరవార్తల్లోకి ఎక్కింది.. అదీ ఓ హత్యో…మానభంగమో కాదు..గంజాయి కి అడ్డాగా మారింది. నిన్న కాక మొన్న జిల్లా లో ఎస్.కోటలో గంజాయి పట్టుబడిన ఘటన మరువక ముందే జిల్లా కేంద్ర మైన విజయనగరం లో రైల్వే స్టేషన్ వద్ద…పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి నుంచీ 66 కేజీల గంజాయి ని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితమే.. ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ భాస్కరరావు లు రైల్వే స్టేషన్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేసారు కూడా. ఇది జరిగి… రెండు రోజులు పూర్తవకముందే…అదే స్థలం..రైల్వే స్టేషన్ ప్రాంతంలో దాదాపు 66 కేజీల గంజాయి పట్టుబడటంతో…గంజాయి అక్రమ రవాణా కు విజయనగరం జిల్లా కేంద్రంగా మారిందని అంటోంది….”సత్యం న్యూస్. నెట్”.
previous post