సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వేపలసింగారం గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 22వ,వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘గీత గోవిందం భజన మండలి’ వారిచే భజన కార్యక్రమం వీనులవిందుగా సాగింది.
ప్రముఖ సీనియర్ సంగీత కళాకారుడు ముడుంబై దామోదరా చార్యుల పర్యవేక్షణలో గణేశ శరణం కీర్తనతో ప్రారంభమైంది.ప్రధాన గాయకులు గోవిందు,నాగలక్ష్మి ఆలపించిన ‘పలుకే బంగారమాయెనా’, ‘ఎన్ని పూలు కోసిన’ కీర్తనలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.
ఈశ్వరాచారి క్యాసీయో,చిన్ని డోలక్ వాయిద్య సహకారం అందించారు. దేవస్థానం అర్చకులు శ్రీమాన్ అవధానుల వినోద్ కుమార్ శాస్త్రి కళాకారులను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. దేవస్థానం చైర్మన్ కదిరి వెంకటరెడ్డి, రేక్కల పెద్ద వెంకట్ రెడ్డి, పాలక మండలి సభ్యులు కళాకారులను శాలువాలతో సన్మానించారు.
ఈ భక్తి భజన కార్యక్రమంలో బారు సుజాత,తమ్మన సుజాత,జి.ఎన్.వి. ప్రసాద్,శ్రీనివాసా చారి,సరోజిని మైనేని విజయలక్ష్మి,లక్ష్మి,గురవయ్య, విశేష సంఖ్యలో భక్తులు, శ్రోతలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్