నిత్యం మీడియా వారిని వారి పబ్లిసిటీ కోసం వాడు కొనే ప్రజాప్రతినిధులు,అధికారులు వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్పందించడం అరుదు. మరి కొందరు జర్నలిస్టుల ను పప్పన్నంలో కరివేపాకులా వాడుకునేవారే కానీ ఆదుకునే వారు అరుదు.
అటువంటి వారికి భిన్నంగా తన పేరు స్వార్థ చేసుకున్న వ్యక్తిత్వం ఉన్న అధికారిగా రాజంపేట ఆర్డీవో ధర్మాచంద్రా రెడ్డి చాటుకున్నారు. కరోనా బారిన పడి కోలుకుని ఇంటికి చేరుకున్న కడప జిల్లా రాజంపేట ఏబీఎన్ రిపోర్టర్ మిత్రుడు అనుమల ఈశ్వరయ్యకు నందలూరులోని స్వగృహంకు నందలూరు తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ద్వారా రాజంపేట ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి రెండు బస్తాల బియ్యంతో పాటూ కందిపప్పు నగదు తదితరం ఇవ్వడం ప్రశంసనీయం.
కడప క్వారైన్ టెన్ లో ఉన్నప్పుడు స్వయంగా ఆయనే ప్రతిరోజూ రెండు పూటలా ఫోన్ లో యోగ క్షేమాలు కనుక్కోవడంతో పాటు, తగు సూచనలు ఇచ్చారు. దీనితో అనుమల ఈశ్వరయ్య కుటుంబం తో పాటు,రాజంపేట కలం గళం ప్రింట్ మరియు మీడియా మిత్రుల హర్షం వ్యక్తం చేశారు.